ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. “త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. మా మద్దతు లేకుండా మీరు (బిజెపి) విజయం సాధించలేరు. మీరు దానిని మరచిపోకూడదు” అని బెనర్జీ పేర్కొన్నారు. జూలై 24, 2022 న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఉత్తరప్రదేశ్లో బిజెపికి లభించిన అతి పెద్ద విజయం ప్రధాని మోదీకి బలం చేకూర్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రామ్నాథ్ తదనంతరం భావి రాష్ట్రపతిని నిర్ణయించడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వేచ్ఛగా వ్యవహరించే వెసులుబాటు ఉందని వారు చెప్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఒకవేళ సమాజ్వాదీ పార్టీ (ఎస్పి)కి అనుకూలంగా వచ్చి ఉంటే.. బిజూ జనతాదళ్ (బిజెడి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీల మద్దతుపై బిజెపి ఆధారపడవలసి వచ్చేది. కానీ, ఇప్పుడు అలాంటి అవసరం బీజేపీకి ఉండదనేది వారు చెప్తున్న మాట. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ మరియు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సభ్యులు ఉంటారు. శాసన మండలి సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో భాగం కాదు. సంఖ్యల పరంగా, ఎలక్టోరల్ కాలేజీలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ సభ్యులు మరియు 4,120 మంది శాసన సభ సభ్యులు – మొత్తం 4,896 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎంపీ ఓటు విలువ 708గా నిర్ణయించగా, రాష్ట్రాలలో ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. 4,896 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ మొత్తం విలువ 10,98,903 కాగా, గెలిచిన అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించబడాలంటే కనీసం 50 శాతం ప్లస్ వన్ ఓటును పొందాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ