ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు జనవరి 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్బాబుతో పాటుగా కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీలు ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటూ సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో చేరాల్సిందిగా మోహన్ బాబును ప్రధాని మోదీ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. మోహన్బాబు కుటుంబ సమేతంగా వెళ్లి మోదీతో భేటీ అవ్వడంపై రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేరిక విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో కూడా మోహన్ బాబు సమావేశం కానున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ యేనా, ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా అన్న విషయం తేలాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.
[subscribe]
YCP Leader Prudhvi Raj Satires On Pawan Kalyan In Press Meet | AP Capital Issue | Mango News
03:43
YCP Leader Prudhvi Raj Lashes Out Chandrababu Naidu In Press Meet | AP Political News | Mango News
04:35
Botsa Satyanarayana Controversial Statements Over AP Capital Development In Press Meet | Mango News
10:43
YCP Leader Prudhvi Raj Derogatory Comments On Chandrababu Naidu In Press Meet | AP Political News
04:33