తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు/ద్వైపాక్షిక సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న ఢిల్లీకి రావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, అజెండా సంబంధిత అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. అలాగే ఈ సమావేశంలో చర్చించే ద్వైపాక్షిక సమస్యల ఎజెండా, ఇతర అంశాలను కూడా మీటింగ్ నోటీసులో పొందుపరిచారు. సెప్టెంబర్ 27వ తేదీన, ఢిల్లీలో నార్త్ బ్లాక్, హోంశాఖ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 119లో ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ద్వైపాక్షిక సమస్యల ఎజెండా:
- డివిజన్ ఆఫ్ షెడ్యూల్ IX – ప్రభుత్వ కంపెనీలు మరియు కార్పొరేషన్లు
- షెడ్యూల్ X విభజన – రాష్ట్ర సంస్థల విభజన
- చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల విభజన
- డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (APSFC)
- డివిజన్ ఆఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరియు ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (APHMEL)
- నగదు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ విభజన (కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు/సాధారణ సంస్థలపై ఖర్చు/ఏక్టర్నల్లి ఎయిడెడ్ ప్రాజెక్ట్లకు సంబంధించిన పబ్లిక్ రుణం)
- టీఎస్సీఎస్సీఎల్ నుండి ఏపీఎస్సీఎస్సీఎల్ కి చెల్లించాల్సిన నగదు క్రెడిట్ మొత్తం మరియు ఏపీఎస్సీఎస్సీఎల్ కి 2014-15 బియ్యం సబ్సిడీ విడుదల అంశం
ఇతర అంశాలు:
- పన్ను ప్రోత్సాహకాలు (ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94 (1) మరియు (2)]
- రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ప్రాంతాన్ని కవర్ చేసే రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్
- పన్ను విషయాలలో అసమానత యొక్క తొలగింపు [సెక్షన్ 50, 51 మరియు 56]
- వనరుల అంతరం/గ్యాప్
- కొత్త రాజధాని నగర ఏర్పాటుకు కేంద్ర సహకారం
- విద్యా సంస్థల స్థాపన
- కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY