సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారతదేశానికి అటార్నీ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబరు 1 నుంచి దేశ అత్యున్నత న్యాయ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ప్రస్తుత అటార్నీ జనరల్ పదవీకాలం కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. ఇక 91 ఏళ్ల వేణుగోపాల్ జూన్ 30, 2017న దేశ అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ఈ ఐదేళ్లలో ఆయనకు అనేకసార్లు పొడిగింపులు ఇచ్చారు. వయస్సురీత్యా ఆయన తప్పుకోనుండటంతో ముకుల్ రోహత్గీ ఈ అత్యున్నత పదవిని చేపట్టేందుకు తన సమ్మతిని తెలిపారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన అటార్నీ జనరల్గా రెండోసారి బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. ఇక ఆయన 2014లో తొలిసారిగా మూడేళ్ల కాలానికి గాను అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. అలాగే గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా రోహత్గీ పనిచేశారు. కేంద్రప్రభుత్వానికి ఎదురయ్యే న్యాయపరమైన అంశాల్లో అటార్నీ జనరల్ పాత్ర కీలకం అన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY