ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని 6 జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజించింది. వీటిలో.. ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లా కేంద్రాలను అర్బన్ మరియు రూరల్ కేంద్రాలుగా విడదీయగా.. మచిలీపట్నాన్ని సౌత్ మరియు నార్త్ మండలాలుగా విభజించింది. మచిలీపట్నంలోని 1-19 వార్డులు మరియు 40వ వార్డుతో పాటు 18 గ్రామాలను కలిపి మచిలీపట్నం నార్త్ మండలంగా.. అలాగే 20-39 వార్డులు, రూరల్ సహా మరో 12 గ్రామాలను కలిపి మచిలీపట్నం సౌత్ మండలంగా ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రజలకు కీలక సూచన చేసింది. ఈ మండలాల విభజనపై ఏవైనా అభ్యంతరాలుంటే ఒక నెలలోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలపాలని కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE