ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షా విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న విద్యాశాఖ, సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల పద్దతిని అవలంబించనున్నారు. కాగా గతంలో 11 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. అయితే గత రెండేళ్ల కాలంగా కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా పదో తరగతి పరీక్షలను 7 పేపర్లకు కుదించింది ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి దీనిని కూడా మారుస్తూ ఆరు సబ్జెక్టులకు 6 పేపర్లు విధానంలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే సీఎం జగన్ సూచన మేరకు 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY