ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు ఈ-కామర్స్ పోర్టల్స్ మరియు యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజానిర్ణయంతో రెడ్బస్, అభిబస్,పేటీఎం లేదా ఇతర ప్రైవేట్ పోర్టల్స్ మరియు యాప్స్ లో ఆర్టీసీ టికెట్స్ బుక్ చేసుకునే వారు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా జరిగే టికెట్ బుకింగ్ కు మరియు నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు ఈ జీఎస్టీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ