తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ హబ్ నిర్మాణం జరుపుకోనుండగా, ప్రభుత్వం ఇందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని టైర్ 2 పట్టణాల్లో ఐటీని ప్రోత్సహించే విధానంలో భాగంగా ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ ఐటీ హబ్ లు ఏర్పాటు చేయగా, తాజాగా నల్గొండలో కూడా ఐటీ హబ్ నిర్మాణం ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
వచ్చే 18 నెలల్లో ఈ ఐటీ హబ్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని, దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా దీన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. మరోవైపు నల్గొండలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల నిర్మాణాలు, సమీకృత మార్కెట్ సముదాయానికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రజలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకగా, ఆయన వెంట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ