ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల కోసం సమన్వయ కమిటీలను జనసేన పార్టీ నియమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మూడు చోట్ల సమన్వయకమిటీలను నియమించినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు అవసరమైన అన్ని పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని, అభ్యర్ధులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ కావలసిన సలహా, సూచనలను కమిటీ సభ్యులు అందిస్తారని, అలాగే జనసేన విజయానికి ఈ కమిటీలు అభ్యర్ధుల వెన్నంటి ఉంటాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం :
1.ఎ.వి.రత్నం
2.పాలవలస యశస్విని
3.బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
4.డాక్టర్ బొడ్డేపల్లి రఘు
5.పరుచూరి భాస్కరరావు
విజయవాడ:
1.చిల్లపల్లి శ్రీనివాస్
2.అక్కల గాంధీ
3.బూరగడ్డ శ్రీకాంత్
4.అమ్మి శెట్టి వాసు
5.వరుదు రమాదేవి
గుంటూరు:
1.సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
2.కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
3.పాకనాటి రమాదేవి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ