తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 రాష్ట్రాలలో విజయం సాధించిన అనంతరం నిన్న ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. అయితే, ఇది ప్రధాని మోదీ వ్యూహాత్మక ఎత్తుగడగా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. ప్రతిపక్షాల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేసారని తెలిపారు.
Battle for India will be fought and decided in 2024 & not in any state #elections
Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.
Don’t fall or be part of this false narrative.
— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022
అయినా భారతదేశం లోని రాజకీయ పార్టీల భవిష్యత్తు 2024లో నిర్ణయించబడుతుంది, రాష్ట్ర ఎన్నికలలో కాదు అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దు అని సూచించారు. ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రస్తుత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు ప్రజల వైఖరిలో మార్పు ఉంటుందని ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ