రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ద చైన్’ పేరుతో లాక్డౌన్ తరహా ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆంక్షలు గడువు పొడిగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రేక్ ద చైన్ కింద కఠినమైన ఆంక్షలు జూన్ 1 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
మరోవైపు ఏ రవాణా విధానం ద్వారా అయిన రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పిసిఆర్ నెగటివ్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రవేశానికి గరిష్టంగా 48 గంటల ముందుగా ఈ రిపోర్ట్ జారీ చేయబడి ఉండాలని చెప్పారు. అలాగే కార్గో సర్వీసుల్లో డ్రైవర్, క్లీనర్ కు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. కార్గో సర్వీస్ కింద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పిసిఆర్ నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని, అది కూడా 7 రోజుల వరకే చెల్లుతుందని తెలిపారు. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటివరకు 52,26,710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 46,00,196 మంది కరోనా నుంచి కోలుకోగా, 78,007 మంది మరణించారు. ప్రస్తుతం 5,46,129 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ