భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (జనవరి 7, శనివారం) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏడవ ఎడిషన్ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ మరియు రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరుల డిజిటల్ సాధికారత, గ్రాస్రూట్ స్థాయిలో డిజిటల్ ఇనిషియేటివ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం డిజిటల్ ఇనిషియేటివ్స్, డేటా షేరింగ్ అండ్ యూజ్ ఫర్ సోషల్ ఏకనమిక్ డెవలప్మెంట్, పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫారమ్లు–కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖలు మరియు రాష్ట్రాలు, స్టార్టప్ల సహకారంతో డిజిటల్ కార్యక్రమాలు, జిఐజిడబ్ల్యూ అండ్ యాక్సెసిబిలిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్తమ వెబ్ మరియు మొబైల్ కార్యక్రమాలు వంటి 7 కేటగిరులకు సంబంధించి డిజిటల్ ఇండియా అవార్డులు-2022 ను రాష్ట్రపతి అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2022 అనేవి ప్రభుత్వ సంస్థలను మాత్రమే కాకుండా స్టార్టప్లను కూడా డిజిటల్ ఇండియా దార్శనికతను సాధించడానికి గుర్తించి, స్ఫూర్తినిచ్చి ప్రేరేపిస్తాయని అన్నారు. ఈ అవార్డులు డిజిటల్ గవర్నెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజల సామర్థ్యాన్ని వెలికితీసే డిజిటల్ సాధికారత కలిగిన సమాజంగా భారతదేశాన్ని మార్చడానికి మరో అడుగు అని చెప్పారు. అవార్డుల విజేతలను ఆమె అభినందిస్తూ, పౌరుల సాధికారత మరియు డేటా షేరింగ్ ప్లాట్ఫారమ్ నుండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు రూపొందించిన విభిన్న శ్రేణి ఆవిష్కరణలను చూడటం సంతోషాన్ని కలిగించిందన్నారు
డిజిటల్ ఆవిష్కరణల ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం అని రాష్ట్రపతి అన్నారు. టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిజిటల్ విభజనను గణనీయంగా తగ్గించినప్పుడే భారతదేశం నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్ అంత్యోదయ వైపు మన ప్రయాణంలో సమాజంలోని బలహీన మరియు అట్టడుగు వర్గాలను చేర్చడంలో, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులను బలోపేతం చేయడంలో భారతదేశం సరైన ఉదాహరణగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తన యొక్క కథ ఆవిష్కరణ, అమలు మరియు చేరిక యొక్క కథఅని అన్నారు. ప్రపంచాన్ని మరింత ప్రాప్యత మరియు సమానమైన ప్రదేశంగా మార్చడానికి వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి సహకార ప్లాట్ఫారమ్లను సృష్టించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
భారతీయుల ప్రతిభ విలువను ప్రపంచం గుర్తించేలా చేయడంలో భారతీయ ఐటీ కంపెనీలు విశేషమైన కృషి చేశాయని రాష్ట్రపతి అన్నారు. వినూత్నమైన మేడ్-ఇన్-ఇండియా సాంకేతికతలను రూపొందించడం ద్వారా మనం ప్రస్తుత విధానాలను ప్రభావితం చేయాలి మరియు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉత్పత్తుల కోసం దేశాన్ని ప్రపంచ పవర్హౌస్గా ఉంచడానికి ఎకో సిస్టమ్ ను ప్రారంభించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE