రిలయన్స్ జియో దేశంలో తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. 5జీ స్మార్ట్ఫోన్ ధరను 5,000 రూపాయల కన్నా తక్కువకు విడుదల చేసి, క్రమంగా అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ ఆ ధరను రూ.2,500 నుంచి 3,000 కు తగ్గించాలని భావిస్తున్నట్టుగా రిలయన్స్ జియో కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 2జీ నెట్వర్క్ తో నడిచే ఫోన్లను 20-30 కోట్ల మంది వినియోగిస్తున్నారని, వారిని లక్ష్యంగా పెట్టుకునే ఈ 5జీ స్మార్ట్ఫోన్ విడుదలకు కంపెనీ ప్రణాళికలు సిద్ధంచేస్తోందని అన్నారు.
మరోవైపు దేశంలో ప్రస్తుతం 5జీ స్మార్ట్ఫోన్లు రూ.27 వేల నుంచి లభిస్తున్నాయి. ఇటీవల జరిగిన 43 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారతదేశాన్ని 2జీ ఫ్రీ దేశంగా మార్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2జీ వినియోగదారులే లక్ష్యంగా తక్కువ ధరకు 5జీ స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu