ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమంటూ నాలుగు సిరప్లపై విచారణకు ఆదేశించింది. కాగా ఈ నాలుగు ఔషధాలను తయారు చేసింది ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడం ఇక్కడ గమనార్హం. ఈ సిరప్లను వాడరాదంటూ అన్ని దేశాలకూ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘చిన్నారుల మరణం ఎంతో బాధాకరమన్న ఆయన, ఆ నాలుగు మందుల కారణంగానే చిన్నారులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాధమికంగా తేలిందని స్పష్టం చేశారు. ఈ నాలుగు మందులు భారతదేశంలో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న దగ్గు మరియు జలుబు సిరప్లని తెలిపారు. దీంతో భారతదేశంలోని సంబంధిత కంపెనీ మరియు నియంత్రణ అధికారులతో డబ్ల్యూహెచ్ఓ విచారణను నిర్వహిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా గాంబియాలో ఈ మందుల వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా 66 మంది పిల్లలు మృత్యువాత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక డబ్ల్యూహెచ్ఓ విచారణ చేస్తున్న ఈ నాలుగు మందులు ఇవే.. ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్ మరియు మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్లు. ఈ ఉత్పత్తుల తయారీదారు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ హర్యానా రాష్ట్రం నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ మందుల భద్రత మరియు నాణ్యతపై సంబంధిత కంపెనీ, డబ్ల్యూహెచ్ఓకు ఎలాంటి పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY