కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ శాఖ గురువారం దేశంలోని 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏడో విడతగా 14 రాష్ట్రాలకు 7,183.42 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం పీడీఆర్డీ గ్రాంట్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 14 రాష్ట్రాలకు మొత్తం 86,201 కోట్లు సిఫార్సు చేసింది.
దీంతో ఈ గ్రాంట్ని మొత్తం 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేయబడిన 14 రాష్ట్రాలకు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా 2022-23లో తాజాగా ఏడో విడత విడుదలతో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ల మొత్తం రూ.50,282.92 కోట్లుకు చేరిందని చెప్పారు. పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు అందించబడుతుండగా, ఈ 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వివరాలు:
- ఆంధ్రప్రదేశ్ – రూ.879.08 కోట్లు
- అస్సాం – రూ.407.50 కోట్లు
- హిమాచల్ ప్రదేశ్ – రూ.781.42 కోట్లు
- కేరళ – రూ.1097.83 కోట్లు
- మణిపూర్ – రూ.192.50 కోట్లు
- మేఘాలయ – రూ.86.08 కోట్లు
- మిజోరాం – రూ.134.58 కోట్లు
- నాగాలాండ్ – రూ.377.50 కోట్లు
- పంజాబ్ – రూ.689.50 కోట్లు
- రాజస్థాన్ – రూ.405.17 కోట్లు
- సిక్కిం – రూ.36.67 కోట్లు
- పశ్చిమబెంగాల్ – రూ.1132.25 కోట్లు
- త్రిపుర – రూ.368.58 కోట్లు
- ఉత్తరాఖండ్ - రూ.594.75 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY