చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. ఈ ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ఎంపీ కే కేశవరావు ఎమ్మెల్సీ కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ సమస్య కానే కాదని, ఇది జాతీయ మహిళల సమస్య అని కవిత పేర్కొన్నారు. అలాగే ఇది ఏ ఒక్క పార్టీకో చెందిన అంశం కాదని, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని, డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. మోదీ సర్కార్ తలచుకుంటే పార్లమెంట్లో ఈ బిల్లు పాసవుతుందని, పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని ఆమె కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE