డిసెంబర్ 2022 కల్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ కేటీఆర్ తెలిపారు. శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “దండుమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) డిసెంబర్ 2022 సరికల్లా అందుబాటులోకి వస్తుందని అని తెలుపటానికి సంతోషిస్తున్నాను. ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పి, వాటిల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటుచేసి స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ వారి ఉపాధి అవకాశాలు పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. 547 ఎకరాల్లో విస్తరించి, 589 ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన దండుమల్కాపురం ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY