ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆగస్టు 16 నుండి ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో సంతృప్తికర స్థాయిలో దళిత బంధు పథకం అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పథకం అమలు కోసం రూ. 500 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
రూ.500 కోట్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. టీఎస్ సీసీడీసీ లిమిటెడ్ (హైదరాబాద్) వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ, కరీంనగర్ కలెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆగస్టు 6న వాసాలమర్రి గ్రామానికి కూడా దళిత బంధు పథకం అమల్లో భాగంగా రూ.7.60 కోట్ల నిధులును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద దళితుల అభివృద్ధి కొరకు కుటుంబానికి పదిలక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ