ఆంధ్రప్రదేశ్లో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రకు స్వస్తి చెప్తున్నామని, కొనుగోళ్లలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.
వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం జగన్ అధికారులకు చేసిన కొన్ని సూచనలు..
- ఏపీలో ఇకపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్రను తీసివేస్తున్నాం. ఈ మేరకు అధికారులు దృష్టి సారించాలి.
- తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చూడాలి.
- అలాగే ధాన్యాన్ని అత్యంత పటిష్ట విధానంలో సేకరించేందుకు ఇ-క్రాపింగ్ పద్దతిని వినియోగించుకోవాలి.
- ఎక్కడా రైతులు తమ ధాన్యాన్ని ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని భావించకూడదు.
- వ్యవసాయ శాఖ అధికారులు రాబోయే రబీ సీజన్ కోసం ఇప్పటినుంచే అన్ని విధాలా సమాయత్తం కావాలి.
- రైతులకు విత్తనాలు, ఎరువులు వంటివి సకాలంలో అందించాలి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్బీకే కేంద్రాల్లో డ్రోన్స్ ఏర్పాటు చేయాలి. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలి.
- అలాగే ప్రతి ఆర్బీకే కేంద్రంలో భూసార పరీక్షలు నిర్వహించే అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచాలి.
- దీనివలన రైతులకు పంటకు పెట్టే పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరుగుతాయి.
- వచ్చే మార్చి నాటికి దీనిని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE