ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని, నూతన సీఎస్ జవహర్ రెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు చేశారు.
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ చేసిన కీలక సూచనలు..
- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో రోగులకు మందులతో పాటు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించాలి.
- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విజయవంతం కావడానికి అన్ని వనరులను వినియోగించుకోవాలి.
- 104 వాహనాలను సమకూర్చుకోవడంతో పాటు ఖాళీలు ఉన్నచోట సిబ్బందిని నియమించుకోవాలి.
- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో స్త్రీ శిశుసంక్షేమశాఖను భాగస్వామిని చేయాలి.
- చిన్న పిల్లలు, బాలింతలు, గర్భవతుల్లో ఎనీమియాతో బాధపడేవారిని గుర్తించి స్త్రీ శిశుసంక్షేమశాఖకు తెలియజేయాలి.
- వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం వంటివాటిని అందించాలి.
- వచ్చే ఏడాది ఉగాది పండుగ సమయానికి విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలు పూర్తి చేయాలి.
- ఇక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో డాక్టర్లు విధిగా గ్రామాలను సందర్శించాలి.
- దీనికి సంబంధించిన రియల్ టైం డేటాను లొకేషన్ తో సహా రికార్డు చేయాలి.
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని, మంచానికే పరిమితమైన వారికి అవసరమైన వైద్య సహాయం ప్రతి నెలా అందించాలి.
- ఆరోగ్యశాఖలో క్రిందిస్థాయి సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందించాలి. అలాగే వాటిలో ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలకు సంబంధించిన యాప్స్ అందుబాటులో ఉంచాలి.
- తద్వారా ఎవరికి ఏ విధమైన చికిత్స ఎక్కడ అందిస్తారో ప్రజలకు వివరాలు అందించడానికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు వీలుంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE