ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని లేఖలో సీఎస్ ను కోరారు. లేఖతో పాటుగా ముద్దనపల్లిలో సర్వే నెంబర్ 104, 213 లలో అక్రమ మైనింగ్ పై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను జత చేశారు.
ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించిందని, అందుకు పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎస్ తో పాటుగా సంబంధిత అధికారులు వెంటనే ఈ మైనింగ్ అంశాన్ని పరిశీలించి శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ అదేశాలను అమలు చేయాలని కోరారు. అన్ని విధాలా పకడ్బందీ చర్యలతో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ