భారత స్వాతంత్య్ర 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా ఆగస్టు 13 మరియు 15 మధ్య ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని లేదా ప్రదర్శించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఉదయం (ఆగస్టు 13, శనివారం) న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాతృభూమి కోసం సర్వస్వం త్యాగం చేసిన వీరులకు అమిత్ షా నివాళులు అర్పించారు.
అనంతరం అమిత్ షా ట్వీట్ చేస్తూ “తిరంగా మనకు గర్వకారణం. ఇది భారతీయులందరినీ ఏకం చేసి స్ఫూర్తినిస్తుంది. హర్ ఘర్ తిరంగా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు న్యూఢిల్లీలోని నా నివాసంలో తిరంగాను ఎగురవేసి, మాతృభూమి కోసం సర్వస్వం త్యాగం చేసిన మన వీర వీరులకు నివాళులు అర్పించారు. ఆగస్టు 13-15 తేదీల మధ్య మీ ఇంటి వద్ద తిరంగాను ఎగురవేయాలని మరియు ప్రతి హృదయంలో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొలిపే ఈ ప్రచారంలో భాగం కావాలని నేను దేశప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తిరంగాతో ఉన్న మీ ఫోటోను http://HarGharTiranga.comలో అప్లోడ్ చేసి, ఇందుకోసం ఇతరులను ప్రేరేపించండి” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY