పంజాబ్ లో నటుడు సోనూసూద్ పై నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు పోలీసులు. తన సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మోగా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన సోదరి కోసం పంజాబ్ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ బూత్ వద్ద సోనూసూద్ కనిపించిన ఆయన కారును పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని తరువాత, మోగాలోని లాండెకే గ్రామంలో సోనూసూద్ తన సోదరి కోసం ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సోనూసూద్ పై మోగా సిటీ పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేయబడింది.
పోలింగ్ రోజున సోనూ కారును జప్తు చేసి ఆయనను ఇంటికి పంపించారు. సోనూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం మోగాలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించకుండా ఆయనను నిషేధించింది. అయితే, దీనిపై సోనూసూద్ స్పందించారు. “ఆ రోజు విపక్షాలు, ముఖ్యంగా అకాలీదళ్ ప్రజలు వివిధ బూత్లలో బెదిరింపు కాల్లను మేము తెలుసుకున్నాము. కొన్ని బూత్లలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం మా కర్తవ్యం. అందుకే అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి” అని సోనూసూద్ మీడియాతో అన్నారు. కాగా, ప్రస్తుతం సోనూ సూద్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో రియాలిటీ టీవీ షో షూటింగ్లో ఉన్నాడని తెలిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ