న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ 2022, డిసెంబర్ 1 నుండి వారంలో ఐదు రోజుల పాటు ప్రజల సందర్శనకు తెరిచి ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో ప్రజలు/సందర్శకులు పర్యటించేందుకు బుధ, గురు, శుక్ర, శని మరియు ఆదివారాల్లో (గెజిటెడ్ సెలవులు మినహా) అనుమతి ఉంటుందన్నారు. ఆయా రోజుల్లో ఐదు టైమ్ స్లాట్లలో అనగా ఉదయం 10.00-11.00 గంటలు, 11.00-12.00, 12.00-13.00, 14.00-15.00 మరియు 15.00-16.00 మధ్య ఒక్కొక్కరికి గంట చొప్పున రాష్ట్రపతి భవన్ సందర్శనకు ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అలాగే రాష్ట్రపతి భవన్ పర్యటనతో పాటుగా ప్రజలు మంగళవారం నుండి ఆదివారం వరకు (గెజిటెడ్ సెలవులు మినహా) వారానికి ఆరు రోజులు రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ని సందర్శించవచ్చని తెలిపారు. ఇక ప్రతి శనివారం నాడు ప్రజలు రాష్ట్రపతి భవన్లోని ఫోర్కోర్ట్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు గార్డ్ మార్పు వేడుకను కూడా చూడవచ్చన్నారు. గెజిటెడ్ హాలిడే అయినా లేదా రాష్ట్రపతి భవన్ నోటిఫై చేసినా శనివారం రోజు వేడుక జరగదు అని తెలిపారు. రాష్ట్రపతి భవన్ ను సందర్శించాలనుకునే వారు http://rashtrapatisachivalaya.gov.in/rbtour వెబ్సైట్లో తమ స్లాట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE