తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 3న పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు గంటసేపు అన్ని అంశాలను పరిశీలించి, పనులు జరుగుతున్న తీరును తెలుసుకుని, మరింత ముమ్మరంగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదరరావు, వద్దిరాజు రవిచంద్రలు కూడా ఉన్నారు.
మరోవైపు మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ పరిశీలించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కార్యాలయం కోసం చేస్తున్న మరమత్తులు, మార్పులపై సిబ్బందికి సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. వసంత్ విహార్ లో పార్టీ ఆఫీస్ నిర్మాణదశలో ఉన్నందున, ఏడాది కాలానికి సర్ధార్ పటేల్ పటేల్ మార్గ్లో జోధ్పూర్ వంశీయులకు చెందిన బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ కు ఆమోదం రాగానే లీజుకు తీసుకున్న ఈ కార్యాలయం నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY