తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులు ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ను కలుసుకుని వివరాలును తెలియజేశారు. నగరంలోని జినోమ్ వ్యాలీలో గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లు, లారస్ ల్యాబ్స్ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 1300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నదుకు ఆ కంపెనీలకు మంత్రి కేటిఆర్ ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
Delighted that the Life Sciences ecosystem continues to thrive in Telangana👍
Two important announcements on new investments from @GranulesIndia and @LaurusLabs
₹700 Cr investment and more than 1300 direct jobs to be created. Both units to come up in Genome Valley, Shamirpet https://t.co/6gF2Qjvihh
— KTR (@KTRTRS) October 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu