హైదరాబాద్లోని పాతబస్తీలో బహదూర్పురా ఫ్లైఓవర్ను ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో మొత్తం రూ.495.75 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.108 కోట్లతో బహదూర్పురా వద్ద ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్ నిర్మించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి)లో భాగంగా బహదూర్పురా ఫ్లైఓవర్ను రూ.108 కోట్లతో నిర్మించామని, ఇందులో నిర్మాణ వ్యయం రూ.69 కోట్లు కాగా, మిగిలిన మొత్తాన్ని భూసేకరణకు వెచ్చించామని జిహెచ్ఎంసి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 690-మీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ రద్దీగా ఉండే బహదూర్పురా జంక్షన్ ద్వారా వివిధ దిశల్లో ప్రయాణించే ప్రయాణికులకు మరియు నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించే వారికి ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.8 వేల నుంచి రూ.17 వేలకు పెంచామని తెలిపారు. రూ.108 కోట్లతో అభివృద్ధి చేసిన బహదూర్పురా వద్ద ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్ మరియు రూ.2.55 కోట్లతో మీర్ ఆలం చెరువులో మ్యూజికల్ ఫౌంటెన్ను ప్రారంభించారు. అలాగే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన నిర్వహించారు. సర్దార్ పునరుద్ధరణతో పాటు మీర్ ఆలం మురుగునీటి ప్లాంట్ మరియు కార్వాన్ సమీపంలో మురుగునీటి నెట్వర్క్ను పునరుద్ధరించడం వంటి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్, సిలిండర్ ధరలు పెంచటంలో ముందుకు పోతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ