తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు.
బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
- వైద్యఆరోగ్య శాఖకు రూ.6295 కోట్లు కేటాయింపు.
- పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.11046 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.3,077 కోట్లు
- ఐటీ రంగానికి రూ.360 కోట్లు
- అటవీ శాఖకు రూ.1276 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ.8788 కోట్లు
- హోమ్ శాఖకు రూ.6465 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.2363 కోట్లు
- సాంస్కృతిక పర్యాటక రంగాలకు రూ.726 కోట్లు
- దేవాదాయశాఖకు రూ.720 కోట్లు
- పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు
- సాగునీటి రంగానికి రూ.16931 కోట్లు కేటాయింపు
- వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖకు రూ.5,522 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు
- విద్యారంగ అభివృద్ధికి రూ.4000 కోట్లతో సరికొత్త విద్యా పథకం ప్రతిపాదన, ఈ సంవత్సరం 2 వేల కోట్ల నిధుల ఖర్చు.
- పాఠశాల విద్యకు రూ.11735 కోట్లు
- ఉన్నత విద్యారంగానికి రూ.1873 కోట్లు
- రైతు బంధు కోసం – రూ.14 ,800 కోట్లు
- రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు కేటాయింపు
- రైతు భీమా పథకం కోసం: రూ.1200 కోట్లు
- రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు
- ఆసరా పెన్షన్స్ కోసం రూ.11,728 కోట్లు
- కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కోసం రూ.2750 కోట్లు కేటాయింపు
- ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు
- ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు కేటాయింపు
- వరంగల్ కార్పొరేషన్కు రూ.250 కోట్లు కేటాయింపు.
- ఖమ్మం కార్పొరేషన్కు రూ.150 కోట్లు కేటాయింపు
- రూ.1000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం
- రెవెన్యూ వ్యయం – రూ.1, 69, 383.44 కోట్లు
- రెవెన్యూ మిగులు – రూ.6, 743.50 కోట్లు
- పెట్టుబడి వ్యయం – రూ.29.046.77 కోట్లు
- ఆర్థిక లోటు – రూ.45,509.60 కోట్లు
- రాష్ట్రంలో రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలకు సంబంధించిన యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
- రాష్ట్రంలో రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
- నూతన సచివాలయం నిర్మాణం కోసం రూ.610 కోట్లు
- ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు, బడ్జెట్ లో మొత్తం రూ.800 కోట్లు కేటాయింపు
- టీఎస్ ఆర్టీసీకి రూ.1500 కోట్లు
- ఎస్టీ గృహాలపై రాయితీపై విద్యుత్ అందించడానికి రూ.18 కోట్లు
- బీటీ రోడ్లు సౌకర్యం లేని ఎస్టీ నివాస సముదాయాలకు (హాబిటేషన్లకు) రూ.165 కోట్లు కేటాయింపు
- చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
- నాయిబ్రాహ్మణుల సెలూన్లకు ప్రభుత్వం రాయితీతో విద్యుత్
- వచ్చే రెండు సంవత్సరాల్లో ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
- రజకుల కోసం అధునాతన వసతులతో ధోబీఘాట్స్ నిర్మాణం
- కల్లు-గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.25 కోట్లు
- గొల్ల కుర్మలకు రూ.3000 కోట్లతో మరో మూడు లక్షల యూనిట్ల గొర్రె పిల్లలు పంపిణి చేయని నిర్ణయం
- బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు రూ. 1000 కోట్లు
- మైనార్టీ గురుకులాల నిర్వహణకు రూ.561 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1,606 కోట్లు
- మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
- షీ టాయిలెట్లు నిర్మించేందుకు రూ.10 కోట్లు
- పట్టణాల్లో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ల కోసం రూ.500 కోట్లు
- పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం: రూ.200 కోట్లు
- రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ కోసం రూ.750 కోట్లు
- పరిశ్రమల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి:
- ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
- నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్ కు నీటిని తరలించడానికి కొత్త ప్రాజెక్టు కోసం రూ.1450 కోట్లు అంచనా ఉండగా ఈ బడ్జెట్ లో రూ.725 కోట్లు కేటాయింపు.
- మూసీ నది పునరుజ్జీవం కోసం, సుందరీకరణ కోసం రూ.200 కోట్లు
- మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు
- ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీల తాగునీటి సరఫరా కోసం రూ.250 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ