రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని అక్టోబర్ 8 వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా, సుమారు రూ.650 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారశాఖ కమిషనర్ విజయ్ కుమార్రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందించనున్నారు.
జగనన్న విద్యా కానుక కిట్లలో ఉండే వస్తువులు ఇవే:
- 3 జతల యూనిఫారాలు
- ఒక స్కూల్ బ్యాగ్
- పాఠ్య పుస్తకాలు
- నోట్ బుక్స్
- ఒక జత బూట్లు
- రెండు జతల సాక్సులు
- బెల్టు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu