జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (మే 8, ఆదివారం) కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రాణాలు తీసుకున్న 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు చేరుకోనున్నారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించడంతో పాటుగా, శిరివెళ్ల మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ రచ్చబండ సభ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముందుగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో పర్యటించి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న రచ్చబండ కార్యక్రమ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్థానిక రైతాంగంతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉమ్మడి అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి పలువురు కౌలు రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ