ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సవరించిన క్యాలెండరు ను ప్రకటించింది. ముందుగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. కాగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 15వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఏఐసీటీఈ సవరించిన అకడమిక్ క్యాలెండరు:
- కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి ఆఖరు తేదీ – జూన్ 30, 2020
- కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం – జూలై 15, 2020
- ప్రవేశాల కోసం మొదటి రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – ఆగస్టు 30, 2020
- ప్రవేశాల కోసం రెండో రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – సెప్టెంబర్ 10, 2020
- ఖాళీల అనుగుణంగా విద్యార్థులు చేరడానికి చివరి తేదీ – సెప్టెంబర్ 15, 2020
- పీజీడిఎం/పీజీసిఎం మినహా ఇతర సాంకేతిక కోర్సుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం – ఆగస్టు 16, 2020
- కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మరియు సెకండ్ ఇయర్ లో చేరే లాటరల్ ఎంట్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే తేదీ – సెప్టెంబర్ 15, 2020
- ఇప్పటికే ఉన్న పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థులకు తరగతులు ప్రారంభం – జూలై 15, 2020
- కొత్తగా ప్రవేశం పొందిన పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థుల అకాడమిక్ సెషన్ – ఆగస్టు 1, 2020 నుంచి జూలై 31, 2021
- ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు చివరి తేదీ – ఆగస్టు 16, 2020 మరియు ఫిబ్రవరి 15, 2021
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu