కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దేశంలో సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం కేంద్రం కొత్తగా ఈ పథకం తీసుకురాగా, ఇప్పటికే ఆర్మీ ఉద్యోగాల కోసం ఫిజికల్, మెడికల్ టెస్టులు పాసై, రాత పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ, రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో గతంలో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు గానే, తాజాగా యువత నిరసనలతో అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకాన్ని కూడా కేంద్రం వెనక్కి తీసుకోక తప్పదని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
“వరుసగా 8 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానించింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరించుకోవాలని గతంలో కూడా చెప్పాను. అదే విధంగా అతను ‘మాఫీవీర్’గా మారడం ద్వారా దేశంలోని యువతకు కట్టుబడి ఉండాలి మరియు ‘అగ్నిపథ్’ని వెనక్కి తీసుకోవలసి ఉంటుంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY