పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్దూకు భారీ షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988లో రోడ్డుపై దాడి చేసిన ఘటనలో ఒకరు మరణించిన కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. కాగా, 1988లో డిసెంబరు 27వ తేదీన గుర్నామ్ సింగ్ అనే వ్యక్తికి, సిద్దూకి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గుర్నామ్ సింగ్ను తలపై ఒక్క దెబ్బ కొట్టాడు. అయితే ఈ గాయం కారణంగా అతడు మరణించాడు. ఈ కేసులో భాగంగానే సుప్రీం కోర్టు నేడు సిద్దూకు జైలు శిక్ష విధించింది.
అయితే 2018 నాటి తీర్పుపై బాధిత గుర్నామ్ సింగ్ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించింది. 2018 తీర్పులో సుప్రీం కోర్టు సిద్ధూకి మూడేళ్ల జైలు శిక్షను రూ. 1,000 జరిమానాకు తగ్గించింది. అనంతరం 2018 తీర్పుకు వ్యతిరేకంగా మృతుడి బంధువులు గుర్నామ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్లతో కూడిన ధర్మాసనం సిద్ధూకు శిక్షను పెంచింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ