విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపు మొహాలీలో శ్రీలంకతో జరుగనున్న మొదటి టెస్ట్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు అభిమానులు స్టేడియానికి బారులు తీరనున్నారు. కోహ్లీ 100వ మ్యాచ్ లో 100 పరుగులు చేయాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్తో అరంగేట్రం చేసినప్పటి నుంచి టెస్టు క్రికెటర్గా చాలా సాధించాడు. తొలి మ్యాచ్లో 19 పరుగులు మాత్రమే చేయగలిగిన కోహ్లీ, ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు సాగిన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు.
ఈ క్రమంలో రేపు మొహాలీలో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడేందుకు విరాట్ సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు 99 టెస్టు మ్యాచ్ల్లో కోహ్లీ 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. అలాగే, 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించగా, 40 మ్యాచ్ల్లో కోహ్లీ విజయం అందించాడు. తొలి పదేళ్ల టెస్టు క్రికెట్లో కోహ్లి చేసినన్ని సెంచరీలు ఎవరూ సాధించలేదు. ఇప్పటివరకు టెస్టులలో కోహ్లీ 27 శతకాలు సాధించాడు. 2016లో కోహ్లీ 12 టెస్టుల్లో 1215 పరుగులు చేయడం విశేషం. విరాట్ మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు చేసిన భారత ఆరో ఆటగాడిగా ఘనతను అందుకొంటాడు. మరోవైపు ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారిగా టెస్టులలో పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ