భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ నాలుగో విడతను ఈరోజు ముగించారు. ఈ సందర్భంగా పెద్ద అంబర్ పేటలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదలైన ఈ నాలుగో విడత యాత్ర మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా ఈ యాత్ర పది రోజులపాటు 115 కి.మీ దూరం కొనసాగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జాతీయ నేత మురళీధర్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- తెలంగాణ ప్రజలకు అభినందనలు, ఇక్కడి ప్రజలు స్వతహాగా పోరాట యోధులు.
- సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలనను సాగిస్తున్నారు.
- తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే జైలుకి పంపుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ జైలుకి భయపడరు.
- ఒకవైపు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
- సీఎం కేసీఆర్ కుటుంబ సంక్షేమం కోసమే పాటు పడుతున్నారు, ప్రజల కోసం పాటుపడుతోంది ప్రధాని మోదీ, బీజేపీనే.
- తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. వారందరి కష్టాలు తెలుసుకోవడానికే బండి సంజయ్ యాత్ర చేపట్టారు.
- దేశంలో కుటుంబ పాలనను అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
- ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది.
- తెలంగాణ ప్రజలలో పరివర్తన వచ్చింది. వారు ఇప్పుడు బీజేపీ పాలనను కోరుకుంటున్నారు.
- తెలంగాణలో ఈసారి భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది, అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY