నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చ్ 5, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చ్ 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హుడిగా ప్రకటించారు. ముందుగా టిఆర్ఎస్ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరెడ్డి, ఆతర్వాత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించాడని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని టిఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు వేశారు. ఈ అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ తేదీ: మార్చ్ 12
- నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: మార్చ్ 19
- నామినేషన్ల పరిశీలన: మార్చ్ 20
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చ్ 23
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 7 (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
- ఓట్ల లెక్కింపు పక్రియ: ఏప్రిల్ 9
- ఉప ఎన్నిక పక్రియ ముగింపు: ఏప్రిల్ 13.
[subscribe]