తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. గత నెల 30న ప్రారంభమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. నూతన సచివాలయం ప్రారంభించిన తర్వా త జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇదే కావడం విశేషం. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్టం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల నిర్వహణ మరియు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రులకు మరియు అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE