తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గత కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నిఖత్ జరీన్ బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మరియు డీజీపీ అంజనీ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్, డీజీపీ నిఖత్ జరీన్ను అభినందించారు. సీఎస్ శాంతి కుమారి జరీన్ను శాలువాతో సత్కరించగా.. డీజీపీ అంజనీ కుమార్ పుష్పగుచ్చం అందించారు. ఇక నిఖత్ జరీన్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిందని సీఎస్ ప్రశంసించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, అలాగే ఈ విజయాలతో యువ క్రీడాకారులకు నిఖత్ జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE