అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు సంక్షేమ హాస్టళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఈ సమీక్షకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కీలక సూచనలు, ఆదేశాలు..
- రూ.3,364కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడుకు గ్రీన్ సిగ్నల్. తొలివిడత హాస్టళ్లో నాడు-నేడుకు రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
- జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు. అంగన్వాడీల్లో నాడు-నేడుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశం.
- మొత్తం 3,013 చోట్ల నాడు-నేడు చేపట్టాలని, తొలివిడతలో 1366 చోట్ల నిర్వహించాలని సూచన.
- అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస అవసరాల కోసం 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ఆదేశం.
- ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది సంరక్షకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశం.
- అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించాలని సూచన.
- డిసెంబర్ 1నుంచి అంగన్వాడీలలో విద్యార్థులకు ఫ్లేవర్డ్ మిల్క్ అందిస్తామని తెలిపిన అధికారులతో మూడు నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం ఆదేశం.
- పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్-4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి.
- అంగన్వాడీ కేంద్రాల్లో పీరుదులు స్వీకరించడానికి ప్రత్యేక నంబర్ ఉంచాలని సూచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE