ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి, విద్యాపరంగా పాటించాల్సిన ప్రమాణాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో సీఎం జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..
- ఏపీలో స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయం.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి.
- వర్షాకాలం నేపథ్యంలో స్కూళ్లలో జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎక్కడ ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే సరిదిద్దాలి.
- అలాగే వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికే సిద్ధం చేయాలని ఆదేశం.
- ఇచ్చిన హామీ మేరకు ఆలస్యం చేయకుండా వెంటనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను అందించే ఏర్పాటు చేయాలి.
- ఇంకా ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం ముందుగా నాణ్యమైన టీవీలు ఏర్పాటు చేయాలి.
- అలాగే ఆపై దశల వారీగా అన్ని తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF