ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై కూడా సమీక్ష చేపట్టారు. కాగా ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులనుద్దేశించి కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని కీలక సూచనలు..
- రాష్ట్రంలో ఎక్కడైతే పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు కేటాయించిందో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం.
- ఏపీలో ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి, అలాగే ప్రతీ ఏటా క్రమం తప్పకుండా వారికి తగిన ప్రోత్సాహకాలు సకాలంలో అందించాలి.
- ప్రత్యేక నిధి ద్వారా పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించాలి.
- ఈ ప్రక్రియకు ముందుకొచ్చే కంపెనీలకు, యూనిట్లకు ప్రభుత్వం తరపున ప్రత్యేక సహాయం అందించాలి. ఈ విధానంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
- పంప్డ్ స్టోరేజీ పవర్ ద్వారా వాల్యూ అడిషన్ నిర్వహిస్తున్నామన్న అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు.
- గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టి పెట్టి, వీటి అమలుకు సంబంధించి నూతన విధానం రూపొందించాలని అధికారులకు సూచన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ