అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) భారత్కు శుభవార్త చెప్పింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)పై ఇటీవల విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం దీనిపై కీలక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం వెల్లడించింది. మధ్యవర్తుల అనవసరమైన జోక్యం చేసుకుంటున్న ప్రభావం కారణంగా ఏఐఎఫ్ఎఫ్పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఫిఫా కౌన్సిల్ బ్యూరో నిర్ణయించిందని, ఫిఫా అధికారికంగా ప్రకటించింది. అలాగే అక్టోబర్ 11-30 తేదీలలో జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 షెడ్యూల్ ప్రకారం భారతదేశంలో నిర్వహించబడుతుందని కూడా స్పష్టం చేసింది. దీంతో అక్టోబరులో జరుగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్-2022 టోర్నీపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. ఫిఫా తీసుకున్న తాజా నిర్ణయంతో యథావిధిగా టోర్నీకి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఆగష్టు 14వ తేదీన ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY