హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం నాడు 72వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీల దీక్షాంత్ పరేడ్ జరిగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేపాల్, మాల్దీవులు, మారిషస్ మరియు భూటాన్ యొక్క స్నేహపూర్వక దేశాల నుండి 34 మంది ఆఫీసర్ ట్రైనీలతో సహా మొత్తం 178 ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు అకాడమీ నుండి ఉత్తీర్ణులయ్యారు. అకాడమీలో ఐపీఎస్ ఆఫీసర్ యొక్క ప్రాథమిక శిక్షణ ముగింపును దీక్షాంత్ పరేడ్ సూచిస్తుంది. పరేడ్ లో 178 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొనగా, 144 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, 34 మంది విదేశీ ఆఫీసర్లు ఉన్నారు. 144 మందిలో 23 లేడీ ఆఫీసర్ ట్రైనీలు మరియు 71 వ బ్యాచ్కు చెందిన 21 ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారు. అలాగే 34 విదేశీ ఆఫీసర్లలో భూటాన్ నుండి 12, నేపాల్ నుండి 10, మాల్దీవుల నుండి 7 మరియు మారిషస్ నుండి 5 గురు ఉన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అతుల్ కర్వాల్ తన స్వాగత మరియు పరిచయ ప్రసంగంలో, ఉత్తీర్ణులైన ట్రైనీలు పొందిన వివిధ శిక్షణా సెషన్లు మరియు మాడ్యూల్లను వివరించారు. పరేడ్ లో ఉన్న ఆఫీసర్స్ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన అధికారులుగా పేరు తెచ్చుకుంటారని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్రొబేషనర్గా రంజీతా శర్మకు ప్రధాన మంత్రి బ్యాటన్ మరియు హోం మంత్రిత్వ శాఖ రివాల్వర్ను అందజేశారు. రంజీతా శర్మ ఐపీఎస్ అసోసియేషన్ యొక్క స్వోర్డ్ ఆఫ్ ఆనర్ను గెలుచుకున్న మొట్టమొదటి మహిళ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీగా నిలిచారు. ఇది అవుట్డోర్ ట్రైనింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం ప్రదానం చేయబడింది. అలాగే అకాడమీలో శిక్షణ సమయంలో ఆదర్శప్రాయమైన పనితీరును చూపిన ఇతర ఆఫీసర్ ట్రైనీలకు కూడా ట్రోఫీలను అందజేశారు.
కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, దేశం తీవ్రవాదం, మతతత్వం, మహిళలు మరియు పిల్లలపై నేరాల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. జాతీయ పతాకాన్ని మరియు సొసైటీకి సేవను దృష్టిలో ఉంచుకుని ఆఫీసర్ ట్రైనీలు ఈ సవాళ్లను శక్తివంతంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. సమాజం యొక్క న్యాయం, స్వేచ్ఛను నిలబెట్టడానికి మరియు పోలీసు దళానికి పరివర్తన నాయకత్వం అందించడానికి కృషి చేయాలనీ పాసింగ్ అవుట్ ఆఫీసర్ ట్రైనీలను కోరారు. ఈ కార్యక్రమానికి ముందు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన భారత పోలీసు సర్వీస్ అమరవీరులకు నిత్యానంద్ రాయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కూడా నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ