భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ బంగ్లాదేశ్ దేశంలో జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో జరిగే వన్డే, రెండు టెస్టుల సిరీస్ ల కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం నాడు ప్రకటించింది. ఈ సిరీస్ లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు. గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా మళ్ళీ టెస్ట్, వన్డే జట్టులో చోటు దక్కించుకోగా, వన్డే సిరీస్ కోసం రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠిలకు కూడా జట్టులో చోటు లభించింది.
బంగ్లాదేశ్ తో 3 వన్డేలకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.
బంగ్లాదేశ్ తో 2 టెస్టులకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.
బంగ్లాదేశ్ తో భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్:
- మొదటి వన్డే – డిసెంబర్ 4 – షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
- రెండో వన్డే – డిసెంబర్ 7 – షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
- మూడో వన్డే – డిసెంబర్ 10 – షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా
బంగ్లాదేశ్ తో భారత్ రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్:
- మొదటి టెస్టు – డిసెంబర్ 14-18 : జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చటోగ్రామ్
- రెండో టెస్టు – డిసెంబర్ 22-26 : షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE