ఇటీవలే లోక్ సభ, రాజ్యసభలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27, ఆదివారం నాడు పార్లమెంట్ ఆమోదించిన ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు-2020, ద ఎసన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లు-2020 లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మరోవైపు ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో రైతులు మరియు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం విశేషం. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి రానున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu