తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ వేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా.. నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు సంబంధిత అధికారులు ఇవ్వట్లేదని ఈడీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని, కావున బాధ్యులైన వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని హైకోర్టుకు విన్నవించింది. ఈడీ వాదనలు విన్న అనంతరం, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వారిరువురూ ఈ విషయంపై 10 రోజుల్లో కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ