సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ ని శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సెంటర్ ఏర్పాటు వెనుక కీలకంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు అధికారులు, సిబ్బంది మరియు వివిధ సంస్థలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సంస్థలు వ్యక్తులను మించిపోవాలని పేర్కొన్నారు.
లైంగిక నేరస్థుల రిజిస్ట్రీని రూపొందించాలని, నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించాలని, ఎస్ఓఎస్ కేసుల్లో ఫస్ట్ రెస్పాండెర్స్ గా ఉండాలని మరియు సైబర్క్రైమ్ల టోల్ ఫ్రీ నంబర్ 1930ని ప్రచారం చేయాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE