తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 1698 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇందులో 1071 టీజీటీ పోస్టులు, 119 పీఈటి పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా మరో 36 ప్రిన్సిపల్ సహా,ఇతర సంబంధిత ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కి సంబంధించి శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువతీ యువకులకు, ప్రభుత్వం వెల్లడించిన ఈ ప్రకటన ఆనందాన్ని కలుగజేసింది. త్వరలోనే దీనికి గురించిన పరీక్షా తేదీలను నిర్ణయించి, అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=AqMqdhsTlBc]